Advertisement
అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండి మాసానిపేట్ హైస్కూల్ మైదానంలో ఈ నెల 9న వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నరేందర్ గౌడ్ తెలిపారు. ఎల్లారెడ్డి మండలంలోని యువకులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ జట్టు వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. టోర్నమెంట్లో గెలిచిన జట్టుకు రూ.5 వేలు, రన్నర్కు రూ.2,500 అందజేస్తామన్నారు. వివరాల కోసం 9603032511 నంబర్ను సంప్రదించాలని కోరారు.
Advertisement