అక్షరటుడే, వెబ్ డెస్క్: ఏసీబీ వలలో మరొకరు చిక్కారు. జక్రాన్పల్లి మండలం తొర్లికొండ జీపీ సెక్రటరీ తోపారం మనోహర్ రూ.4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. గ్రామానికి చెందిన నిఖిల్ తన ఇంటి ధృవీకరణ పత్రం కోసం మనోహర్ ను ఆశ్రయించగా డబ్బులు డిమాండ్ చేశాడు. అనంతరం నిఖిల్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. సోమవారం లంచం డబ్బులు తీసుకుంటుండగా పథకం ప్రకారం మనోహర్ ను ఏసీబీ అరెస్టు చేసింది.
Advertisement
Advertisement