అక్షరటుడే, వెబ్డెస్క్: ACB Raids : నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.
కాగా.. ఓ సబ్ రిజిస్ట్రార్ను విచారిస్తున్నట్లు తెలిసింది. అర్బన్ కార్యాలయం పరిధిలో ప్రస్తుతం ఇద్దరు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు పని చేస్తున్నారు.
అయితే డాక్యుమెంట్ల వెనక పెద్దఎత్తున వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకించి పార్ట్లీ రిజిస్ట్రేషన్ల కోసం తాము అడిగినంత చెల్లిస్తేనే ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. లేదంటే కొర్రీలు పెడుతున్నారు. దీంతో పలువురు బాధితులు ఏసీబీని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఏసీబీ అధికారులు త్వరలో వెల్లడించనున్నారు.