అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: డ్రంకన్ డ్రైవ్ కేసులో ఆరుగురికి జైలుశిక్ష పడినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో వాహనాల తనిఖీలు నిర్వహించగా.. 17 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. వారిని సెకండ్క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపర్చగా.. ఆరుగురికి జైలుశిక్ష, మరో 11మందికి రూ. 15,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు ట్రాఫిక్ సీఐ తెలిపారు.
Advertisement
Advertisement