PRIVATE SCHOOL | ప్రైవేట్​ స్కూల్​పై చర్యలు తీసుకోవాలి
PRIVATE SCHOOL | ప్రైవేట్​ స్కూల్​పై చర్యలు తీసుకోవాలి
Advertisement

అక్షరటుడే, నిజాంసాగర్​: PRIVATE SCHOOL | మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్​ స్కూల్​పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్​ చేశాయి. ఈ మేరకు నాయకులు మంగళవారం ఎంఈవో తిరుమల రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. శ్రీసాయి హైస్కూల్​ను రేకుల షెడ్​లో నడుపుతున్నారని, ఫైర్​సేఫ్టీ కూడా లేకుండా కొనసాగిస్తున్నారని వివరించారు. ఇంటర్, డిగ్రీ ఫెయిల్​ అయిన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయిస్తున్నారని ఆరోపించారు.

అడ్డగోలుగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. పాఠశాలలో కనీస వసతులు లేవని.. తక్షణమే ఆ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దత్తు, ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ గౌడ్ తదితరులున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  AISF | పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వినతి