NIZAMABAD CITY | పాఠశాలపై చర్యలు తీసుకోవాలి
NIZAMABAD CITY | పాఠశాలపై చర్యలు తీసుకోవాలి
Advertisement

అక్షరటుడే, ఇందూరు: NIZAMABAD CITY | అనుమతి లేకుండా ప్రవేశాలు చేపడుతున్న ప్రెసిడెన్సీ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. బుధవారం డీఈవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఛాంబర్​లో బైఠాయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు లేకున్నా.. కనీసం భవన నిర్మాణం పూర్తి కాకున్నా 50శాతం ప్రవేశాలు చేపట్టారని ఆరోపించారు. ఈ విషయమై విద్యా శాఖ అధికారులు విచారణ చేపట్టాలని కోరారు.

ఇది కూడా చ‌ద‌వండి :  AISF | పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వినతి

జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేసినా డీఈవో స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయాన్ని ముట్టడించిన ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు అంజలి, ప్రధాన కార్యదర్శి రఘురాం తదితరులను పోలీసులు అరెస్ట్​ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

Advertisement