అక్షరటుడే, ఇందూరు: ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 7న ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఓమయ్య తెలిపారు. గురువారం జిల్లా కార్యాలయంలో బంద్కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి హనుమాన్లు, నగరాధ్యక్షుడు శ్రీనివాస్, జబ్బర్, షాదుల్, రఫీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement