అక్షరటుడే, వెబ్డెస్క్ : Akbaruddin Owaisi | హైదరాబాద్(Hyderabad)లో రియల్ ఎస్టేట్(Real Estate) రంగం పూర్తిగా పడిపోయిందని ఎంఐఎం(MIM) ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ(Akbaruddin Owaisi) అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. హైడ్రా(Hydra), మూసీ(Moosi) ప్రక్షాళనతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అయిందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఎంతో మంది నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడానికి ఎలాంటి చర్యలు చేపడుతారని ప్రశ్నించారు.
కేసీఆర్(KCR) హయాంలో ముస్లింలకు రంజాన్(Ram-dan) తోఫా ఇచ్చేవారని అక్బరుద్దీన్ గుర్తు చేశారు. ఇందులో భాగంగా ముస్లింలకు దుస్తులు ఇచ్చేవారన్నారు. కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చాక ఏమి ఇవ్వడం లేదన్నారు. ఇఫ్తార్ పార్టీ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు.