అక్షరటుడే, ఇందూరు: పాఠశాలలు ప్రారంభం కావడంతో రవాణా శాఖ స్కూల్ బస్సుల తనిఖీలు ముమ్మరం చేసింది. గత రెండు రోజులుగా అధికారులు బస్సులను తనిఖీ చేస్తున్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్, పులాంగ్ చౌరస్తాలో పలు ప్రైవేటు స్కూలు బస్సులను పరిశీలించారు. ఫిట్ నెస్ తో పాటు డ్రైవర్లకు లైసెన్స్ లేని మూడు బస్సులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా రవాణా శాఖ కమిషనర్ దుర్గా ప్రమీల, డీటీవో ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రైవేటు స్కూల్ బస్సులను విధిగా ఫిట్ నెస్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. లేకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధానంగా మండల, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పాఠశాల యాజమాన్యాలు సంబంధిత రవాణా శాఖ కార్యాలయంలో పరీక్షలు చేయించాలని ఆదేశించారు. తనిఖీల్లో ఎంవీఐ కిరణ్ కుమార్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement