Advertisement
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Holi | హోలీ సందర్భంగా జిల్లాలో మద్యం దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు. ఎక్కడా కూడా మద్యం విక్రయాలు జరపొద్దన్నారు. అయినా కూడా నగరంలో కొందరు పోలీసుల ఆంక్షలు ఉల్లంఘించారు. పండుగ పూట దర్జాగా బంగ్ అమ్మకాలు చేపడుతున్నారు. వన్ టౌన్ పరిధిలోని మిర్చి కంపౌండ్ సమీపంలో ఓ వ్యక్తి బంగ్ అమ్ముతున్నాడు. బైక్పై తీసుకొచ్చి మరీ బంగ్ విక్రయిస్తున్నాడు. సమీపంలోనే పోలీసు స్టేషన్ ఉన్నప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
Advertisement