Nizamabad | అమ్రాద్​ తండాలో కత్తిపోట్ల కలకలం
Nizamabad | అమ్రాద్​ తండాలో కత్తిపోట్ల కలకలం
Advertisement

అక్షరటుడే, ఇందూరు: Nizamabad | మాక్లూర్​ మండలం అమ్రాద్​లో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్రాద్ తండాలో జ్యోతిరామ్ దంపతులు రేషన్​షాప్​ నిర్వహిస్తున్నారు. అయితే విక్రమ్, పీర్​సింగ్ అనే ఇద్దరు అన్నదమ్ములు తమకు బియ్యం పంపిణీ చేయడం లేదంటూ వారితో గొడవ పడ్డారు. దీంతో అక్కడే ఉన్న జ్యోతిరామ్, సోదరులు శ్రీనివాస్, రాజు నాయక్ అడ్డుకోగా ముగ్గురిపై విక్రమ్​ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. క్షతగాత్రులను నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement