అక్షరటుడే, వెబ్​డెస్క్​: కోళ్లలో అంతుచిక్కని వైరస్​ వ్యాప్తి చెందుతోంది. దీంతో లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. వైరస్​ సోకి ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్లు చనిపోయాయి. దీంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. 2012, 2020లోనూ ఈ తరహా వ్యాధి వచ్చినట్లు పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు.