Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: భక్తులతో వెళ్తున్న బస్సు లోయలో పడి ఐదుగురు మృతి చెందిన ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. 48 మంది భక్తులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఆదివారం తెల్లవారుజామను గుజరాత్లోని డాంగ్ జిల్లా సపుతర కొండ ప్రాంతంలో లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 35 మంది గాయపడ్డారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Advertisement