అక్షరటుడే, వెబ్డెస్క్ : Mark Shankar | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pavan Kalyan) కుమారుడు మార్క్ శంకర్ (mark Shankar) ఇటీవల సింగపూర్లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి కోలుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సింగపూర్ నుంచి పవన్ దంపతులు కుమారుడితో సహా ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. కుమారుడు కోలుకోవడంతో పవన్ సతీమని అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆదివారం తిరుమల (Tirumala) చేరుకున్న ఆమె స్వామివారికి తలనీలాలు సమర్పించారు. డిక్లరేషన్పై సంతకం చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తన కుమారుడు మార్క్ శంకర్ పేరిట సోమవారం మధ్యాహ్నం భక్తులకు(Devotees) అన్నదానం ఏర్పాటు చేశారు. దీని కోసం రూ.17 లక్షలు టీటీడీ(TTD)కి విరాళం ఇచ్చారు.