liquor | మద్యం ప్రియులకు మరో షాక్​?

liquor | మద్యం ప్రియులకు మరో షాక్​?
liquor | మద్యం ప్రియులకు మరో షాక్​?
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : liquor | మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి షాక్​ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీర్ల ధరలను(Beer prices)15 శాతం పెంచిన విషయం తెలిసిందే. బీర్ల ధరల పెరుగుదలతో ఆందోళనలో ఉన్న మందుబాబులకు లిక్కర్​ ధరలు(Liquor Rates Hike) కూడా పెంచి ప్రభుత్వం షాక్​ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత మద్యం ధరలను(liquor Mrp Rates) 18 శాతం పెంచనున్నట్లు సమాచారం. బ్రాందీ, విస్కీ, జిమ్, రమ్ ధరలు పెరిగే అవకాశం ఉంది.

liquor | సీఎం దగ్గరకు చేరిన ఫైల్​​

ధరల పెంపు నిర్ణయమై మద్యం వ్యాపారులు ఇటీవలే సమావేశమై నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫైల్​ రేవంత్​రెడ్డి టేబుల్​కు చేరినట్లు సమాచారం. ప్రైస్‌ ఫిక్సేషన్‌ కమిటీ కూడా 15 నుంచి 20 శాతం వరకు ధరలు పెంచవ్చని ప్రభుత్వానికి రిపోర్ట్‌ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో 18 శాతం రేట్లు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్​ 1 నుంచి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Farmers | రైతులకు మ‌రో శుభ‌వార్త చెప్పనున్న ప్ర‌భుత్వం.. వారికి న‌ష్ట ప‌రిహారం..!