అక్షరటుడే, హైదరాబాద్: HCU LANDS : కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూముల వివాదం మరో మలుపు తిరిగింది. అక్కడి వాస్తవ పరిస్థితిని తెలుసుకొనేందుకు సుప్రీంకోర్టు కేంద్ర సాధికార కమిటీ(central empowered committee)ని నియమించింది.
వివాదాస్పదమైన 400 ఎకరాల భూమిలో చెట్లు మినహా జింకలు, నెమళ్లు లేవని, కృత్రిమ మేధ(AI)తో సృష్టించిన వీడియో క్లిప్పింగ్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ఆరోపించారు.
ఈమేరకు ఈ నెల 3న హైకోర్టు రిజిస్ట్రార్(High Court Registrar) ఆ భూములను పరిశీలించి నివేదిక పంపిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
సిద్ధాంత్ దాస్(Siddhant Das) నేతృత్వంలోని నలుగురు సభ్యుల సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ బుధవారం హైదరాబాద్(Hyderabad) రానున్నట్లు సమాచారం. ఈ కమిటీ 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోనుంది. సంబంధిత అధికారుల నుంచి కూడా సమాచారం సేకరించనుంది.