అక్షరటుడే, బోధన్: Arogyasri | పట్టణంలోని లయన్స్ కంటి ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. ఆయన శనివారం ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 25 ఏళ్లుగా లయన్స్ కంటి ఆస్పత్రి ఎంతోమందికి సేవలందించిందన్నారు.
తెల్ల రేషన్కార్డుదారులకు లయన్స్ ఆస్పత్రిలో ఉచితంగా సేవలందిస్తామని జిల్లా లయన్స్ కోశాధికారి కొడాలి కిషోర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, సబ్కలెక్టర్ వికాస్ మహతో, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్బిన్ హందాన్, ఏసీపీ శ్రీనివాస్, లయన్స్ ఫౌండర్ భసవేశ్వర్రావు, నర్సింహారెడ్డి, రమేశ్, నరేందర్ రెడ్డి, విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.