అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: MP Arvind | నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గురువారం కాంగ్రెస్ నాయకులు ఎంపీ ధర్మపురి అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం విషయంలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. బోధన్లో అన్నివర్గాలకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో కేంద్రీయ విద్యాలయం కోసం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్థలం చూపించారన్నారు. కానీ సుదర్శన్ రెడ్డిపై అర్వింద్ అసత్య ఆరోపణలు చేశారన్నారు. మరోసారి ఇలా ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ నాయకులు మునీర్, అబ్బు తదితరులు పాల్గొన్నారు.
MP Arvind | ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మ దహనం
Advertisement
Advertisement