Nizamabad City | ఆటో ఢీ: విద్యార్థికి గాయాలు
Nizamabad City | ఆటో ఢీ: విద్యార్థికి గాయాలు
Advertisement

అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | ఆటో ఢీకొని ఓ విద్యార్థికి తీవ్ర గాయాలైన ఘటన నగరంలోని కంఠేశ్వర్​ మీసేవా కేంద్రం వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

వివరాల్లోకి వెళ్తే.. సుభాష్​నగర్​లోని కాకతీయ ఒలింపియాడ్​లో విద్యార్థి కౌషిక్ 9వ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం స్కూల్​కు వెళ్లేందుకు కంఠేశ్వర్​లోని మీసేవా కేంద్రం వద్ద సైకిల్​పై రోడ్డు దాటుతుండగా ఆటో బలంగా ఢీకొట్టింది. దీంతో కౌషిక్​కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు ​బాలుడికి స్థానిక ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రి ప్రసాద్​​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ కేసులో రాజీ కావాలంటూ అప్పుడే పలువురు ఒత్తిడి తేవడం గమనార్హం.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  YOUTH EXCHANGE | ముగిసిన యువ ఎక్స్చేంజ్