అక్షరటుడే, ఇందూరు: వేసవిలో విద్యుత్ సమస్యలు రాకుండా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని టీజీఎన్పీడీసీఎల్(TGNPDCL) ఎస్ఈ(ఆపరేషన్స్) రవీందర్ ఆదేశించారు. గురువారం పవర్హౌజ్(POWER HOUSE)లో డీఈలు, ఏఈడీలు, ఏఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రూ. 6 కోట్లతో ఆర్ పవర్ ట్రాన్స్ఫార్మర్లు(POWER TRASFORMERS) ఏర్పాటు చేశామని, రూ. 13.1 కోట్లతో 43 ఇంటర్ లింకింగ్ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే 130 అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని వివరించారు. 126 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల స్థాయిని పెంచామని, అదనంగా జిల్లాలో 26 కొత్త వీసీబీలు అమర్చామన్నారు. మార్చి చివరివారం లోపు పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో జనరల్ మేనేజర్లు వెంకటకృష్ణ, ఎస్ఏవో శ్రీనివాస్, డీఈలు పీవీ రాజేశ్వరరావు, ఎం. శ్రీనివాస్, ఉత్తమ్, ఎండీ ముక్తార్, వెంకటరమణ, ఏడీఈలు, ఏఈలు, ఏఏవోలు పాల్గొన్నారు.
వేసవిలో విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలి
Advertisement
Advertisement