Bhu Bharathi | భూభారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలి

Bhu Bharathi | భూభారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలి
Bhu Bharathi | భూభారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలి

అక్షరటుడే, ఇందూరు: Bhu Bharathi | భూభారతి చట్టంపై రైతులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) సూచించారు. శుక్రవారం డిచ్​పల్లి (dichpally) మండలంలోని నడిపల్లి(nadipally), మోపాల్(mopal) మండల కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

Advertisement

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 14న భూభారతి చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. భూ సమస్యలు(land issues) కలిగిన రైతులు ఏడాది కాలంలోపు ఈ పోర్టల్(portal) ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అవగాహన సదస్సుల అనంతరం మే మొదటి వారంలో అధికారులు గ్రామాల వారీగా సదస్సులను ఏర్పాటు చేసి, అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Aidwa Nizamabad | డీసీపీవోపై చర్యలు తీసుకోవాలి

ఆధార్ కార్డులాగా(aadhar card) భూమికి భూదార్ (Bhudhar) సంఖ్య కేటాయిస్తారని పేర్కొన్నారు. సదస్సులో నిజామాబాద్ ఆర్డీవో(RDO) రాజేంద్రకుమార్, ఐడీసీఎంఎస్(IDCMS) ఛైర్మన్ తారాచంద్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ(Market committe) ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, డిచ్​పల్లి మండల స్పెషల్ ఆఫీసర్ యోహాన్, రైతులు పాల్గొన్నారు.

Advertisement