అక్షరటుడే, ఇందూరు: Baisakhi festival : నిజామాబాద్ నగరంలో బైసా ఖి పండుగను సిక్కులు వేడుకగా నిర్వహించారు. 1699లో గురు గోబింద్ సింగ్ (Guru Gobind Singh) ఇదే రోజున ఖల్సా స్థాపించారు. దానికి గుర్తుగా ఈ పండుగను నిర్వహించుకుంటారు.
వైశాఖమాసంలో మొదటిరోజున ఈ పండుగ వస్తుంది కాబట్టి, హిందువులకు కూడా ఇది పండుగ దినమే. పండుగ సందర్భంగా చేపట్టిన శోభాయాత్రను రైల్వేస్టేషన్(Railway Station) నుడా ఛైర్మన్ కేశ వేణు స్వాగతం పలుకుతూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. సర్దార్ నరేందర్ సింగ్, నరాల రత్నాకర్, శోభన్, కొండపాక రాజేష్, రాజనరేందర్, బాలకిషన్, అవిన్ తదితరులు పాల్గొన్నారు.