అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ ఈ 15న బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో మధ్యాహ్నం రెండు గంటలకు బాధ్యతలు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు ఏఐసీసీ ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. గత శుక్రవారం మహేశ్కుమార్ గౌడ్ ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా పదవీ బాధ్యతల స్వీకరణ అనంతరం నిజామాబాద్ పర్యనటకు రానున్నారు.