HCU Lands | హెచ్​సీయూ భూముల అమ్మకంపై బండి సంజయ్​ కీలక వ్యాఖ్యలు

HCU Lands | హెచ్​సీయూ భూముల అమ్మకంపై బండి సంజయ్​ కీలక వ్యాఖ్యలు
HCU Lands | హెచ్​సీయూ భూముల అమ్మకంపై బండి సంజయ్​ కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: HCU Lands | హెచ్​సీయూ భూముల అమ్మకం గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)​ సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్​సీయూ(HCU)కు సంబంధించిన 400 ఎకరాలను ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement

అయితే ఈ భూములు అమ్మొద్దని విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో భూముల వేలంపై బండి సంజయ్(Bandi Sanjay)​ స్పందించారు. యూనివర్సిటీ భూములు(University lands) అమ్మకపోతే ప్రభుత్వ పాలన సాగదన్నారు. భూములు అమ్మనిదే నెల గడవలేని స్థితికి కాంగ్రెస్​(Congress) ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చిందని విమర్శించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  MLC Election | ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్​ దూరం

బీఆర్ఎస్‌(BRS) కంటే కాంగ్రెస్‌(Congress) పార్టీయే ఎక్కువ అరాచకాలు చేస్తోందని విమర్శించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల(Students)తో పోలీసులు అమానుషంగా వ్యవహరించారని బండి మండిపడ్డారు.

HCU Lands | వారు ఎందుకు స్పందించడం లేదు..

హెచ్​సీయూ(HCU) భూముల అమ్మకాలపై విద్యా కమిషన్​ ఛైర్మన్లు ఎందుకు స్పందించడం లేదని బండి సంజయ్​ ప్రశ్నించారు. కమ్యూనిస్ట్​ భావజాలం(Communist ideology) అని, ప్రజల సమస్యలపై కొట్లాడుతాం అని చెప్పుకునే నాయకులు నేడు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన అన్నారు.

Advertisement