అక్షరటుడే, వెబ్డెస్క్: Champions Trophy | ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ని చిత్తు చేసి defeating New Zealand భారత్ విజయభేరి India won మోగించింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ BCCI భారీ రివార్డ్ ప్రకటించింది. ఐసీసీ నగదుతో పాటు బీసీసీఐ కూడా భారీ మొత్తంలో క్యాష్ రివార్డు అందించింది. ఛాంపియన్స్ ట్రోఫీ Champions Trophy 2025 విజేతగా నిలిచిన టీమిండియా స్క్వాడ్ మొత్తానికి రూ.58 కోట్లు ఇస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
Champions Trophy | గుడ్ న్యూస్..
వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీలను దక్కించుకున్న టీమ్ఇండియా ఆటగాళ్ల Team India players నిబద్ధతని గుర్తించిన బీసీసీఐ వారి శ్రమకి తగ్గ క్యాష్ ప్రైజ్ cash prize ఇవ్వాలని భావించింది. అంతర్జాతీయ వేదికపై భారత క్రికెట్ ఉన్నతస్థానాలకు దూసుకెళుతున్న నేపథ్యంలో బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ BCCI President Roger Binny, సెక్రెటరీ దేవజిత్ సైకియా గుడ్ న్యూస్ అందించారు. పాకిస్తాన్ Pakistan వేదికగా ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. పాకిస్తాన్-భారత్ మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో టీమిండియా మ్యాచ్లు మాత్రం దుబాయ్ Dubai వేదికగా సాగాయి. గ్రూప్ లీగ్లో group league బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ మీద గెలిచిన భారత్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయం defeated Australia సాధించింది. ఫైనల్స్లో న్యూజిలాండ్ మీద గెలిచిన భారత్ మూడోసారి ఛాంపియన్స్గా నిలిచింది.
ఛాంపియన్స్గా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ ప్రత్యేకంగా రూ.58 కోట్ల నగదు Rs. 58 crores to Team India అందజేయడం గమనార్హం. ఈ నగదు మొత్తం కేవలం 15 మంది టీమిండియా ప్లేయర్లే కాకుండా సపోర్టింగ్ స్టాఫ్, కోచింగ్ స్టాఫ్ అందరికీ ఇవ్వనున్నారు. సెలక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్కర్ Ajit Agarkarతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ head coach Gautam Gambhirకి కూడా ఈ నగదు రివార్డు అందించనున్నట్టు తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం మొత్తంగా రూ.60 కోట్ల ప్రైజ్మనీని ఐసీసీ కేటాయించింది. విజేతగా నిలిచిన టీమిండియాకు దాదాపు రూ.19.48 కోట్లు రాగా, రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు runner-up New Zealand రూ.9.72 కోట్లు అందజేశారు. సెమీ ఫైనల్స్లో ఓడిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లకు చెరో రూ.4.86 కోట్లు అందుకున్నాయి. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన అప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లకు రూ.3.04 కోట్లు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచిన పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లకు రూ.1.22 కోట్లు అందజేశారు.