అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు భారత జట్టును శనివారం బీసీసీఐ ప్రకటించింది. మహమ్మద్‌ షమీని జట్టులోకి తీసుకుంది. సూర్య కుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), సంజూ శాంసన్‌(కీపర్‌), అభిషేక్‌ శర్మ, తిలక్‌వర్మ, హార్దిక్‌ పాండ్య, రింకూ సింగ్‌, నితీశ్‌కుమార్‌రెడ్డి, అక్షర్‌ పటేల్‌, హర్షిత్‌ రాణా, అర్షదీప్‌ సింగ్‌, మహ్మద్‌ షమీ, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ధ్రువ్‌ జురెల్‌ లతో కూడిన జట్టును ప్రకటించింది. అలాగే ఈ జట్టులో తెలుగు కుర్రాళ్లు తిలక్‌వర్మ, నితీశ్‌కుమార్‌రెడ్డి చోటు దక్కించుకున్నారు. టీ20 సిరీస్‌ తర్వాత ఈరెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది.

Advertisement
Advertisement

ఐదు టీ20ల సిరీస్‌ షెడ్యూల్‌

జనవరి 22 – తొలిటీ20 (కోల్‌కతా)

జనవరి 25 – రెండో టీ20 (చెన్నై)

జనవరి 28 – మూడో టీ20 (రాజ్‌కోట్‌)

జనవరి 31 – నాలుగో టీ20 (పుణె)

ఫిబ్రవరి 02 – ఐదో టీ20 (ముంబాయి)

మూడు వన్డేల సిరీస్‌ షెడ్యూల్‌

ఫిబ్రవరి 06 – మొదటి వన్డే (నాగ్‌పూర్‌)

ఫిబ్రవరి 09 – రెండో వన్డే (కటక్‌)

ఫిబ్రవరి 12 – మూడో వన్డే (అహ్మదాబాద్‌)

Advertisement