అక్షరటుడే, హైదరాబాద్: Temperatures : తెలంగాణ రాష్ట్రంలో భానుడు నిప్పుల కొమిలా మారి తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఒక్కసారిగా భగభగలతో విరుచుపడ్డాడు. రాష్ట్రంలోని పలు చోట్ల బుధవారం గరిష్ట ఉష్ణోగ్రతలు (Temperature) 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.
పెరిగిన ఉష్టోగ్రతలతో జనాలు అల్లాడుతున్నారు. ఏసీ(AC) లు, కూలర్ల(Coolers) వినియోగం పెరగడంతో విద్యుత్ డిమాండ్ కూడా పెరిగింది. చల్లదనం ఉపశమనం పొందేందుకు ప్రజలు కూల్ డ్రింక్స్, బోండాలు విపరీతంగా తాగేస్తున్నారు. మరో 3 రోజుల్లో 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
నిర్మల్ జిల్లా కడ్డం పెద్దూర్లో అత్యధికంగా 40.7 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా బేలలో 40.6, నిజామాబాద్(Nizamabad) జిల్లా మంచిప్ప(మోపాల్)లో 40.4 డిగ్రీలు నమోదయ్యాయి.
ఒకవైపు కనిష్ట ఉష్టోగ్రత మొన్నటి వరకు 12 డిగ్రీలోపు ఉండగా.. ఒక్కసారిగా 20 డిగ్రీలకు చేరుకున్నాయి. వాతావరణంలో ఒక్కసారిగా ఏర్పడిన మార్పుతో ఒకింత ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కొందరిలో స్కిన్ ఎలర్జీని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. ముఖ్యంగా స్కిన్ పగులు బారిన పడటం గుర్తించినట్లు చెప్పారు.
