అక్షరటుడే, వెబ్డెస్క్ : Deputy CM | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రజాభవన్లో ఈ మీటింగ్ జరగనుంది. కేంద్రంలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది.
సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసి వచ్చారు. రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రెండో దశ, ఫ్యూచర్ సిటీ నిర్మాణం తదితర పనులకు నిధులు కావాలని కోరారు. అనంతరం ఢిల్లీ నుంచి వచ్చిన సీఎం రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి నిధులు తీసుకురావడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రేపు అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించనుండడంపై ఆసక్తి నెలకొంది.