అక్షరటుడే, వెబ్డెస్క్: Tamil Nadu : తమిళనాడు(Tamil Nadu)లో పెన్సిల్ కోసం మొదలైన గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. 8వ తరగతి చదువుతున్న స్నేహితుల మధ్య జరిగిన గొడవతో తోటి విద్యార్థిని కొడవలితో నరికి చంపేశాడు. అడ్డు వచ్చిన ఉపాధ్యాయుడికి సైతం తీవ్రమైన గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. తిరునల్వేలి(Tirunelveli) పాలయంగోట్టై(Palayangottai)లో స్కూల్ ఈ ఘటన జరిగింది. బడిలోని ఇద్దరు స్నేహితులు గత నెల రోజులుగా మాట్లాడుకోకుండా ఉన్నారు. ఈ రోజు మళ్ళీ పెన్సిల్ కోసం గొడవ జరగడంతో ఓ విద్యార్థి వెంట తెచ్చుకున్న కొడవలితో తన స్నేహితుడిని నరికేశాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకుని, జువైనల్ కోర్టు(juvenile court)కు తరలించారు. మరణించిన విద్యార్థి మృతదేహాన్ని పోర్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.