అక్షరటుడే, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. నెల రోజులుగా లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అధికారులు చనిపోయిన కోళ్ల నమునాలను పరీక్షల కోసం ల్యాబ్కు పంపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూర్, తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూర్లోని కోళ్ల ఫారాల నుంచి పంపిన శాంపిల్స్ పరీక్షించి బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు. దీంతో ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా కొన్ని రోజులుగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.
Advertisement
Advertisement