అక్షరటుడే, ఇందూరు: బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఇంటింటా పార్టీ సభ్యత్వ నమోదు చేయించాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించారు. మంగళవారం నగరంలోని దుబ్బలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే నిజామాబాద్ సభ్యత్వ నమోదులో ముందుందన్నారు. కార్యకర్తలు మరింత కష్టపడాలని సూచించారు. అంతకుముందు వ్యాపారవేత్త పవన్ ఖేడియా కుటుంబ సభ్యులతో సభ్యత్వ నమోదు చేయించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, కార్పొరేటర్ పంచరెడ్డి లావణ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement