Advertisement
అక్షరటుడే, ఇందూరు: MP Arvind | రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇందూరులో కేవలం బీజేపీ–ఎంఐఎంల మధ్యే పోటీ ఉంటుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఒక సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. ఇప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేటట్లు కనబడడం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని ఆయన వ్యాఖ్యానించారు.
Advertisement