అక్షరటుడే, వెబ్డెస్క్ : Bjp | దేశవ్యాప్తంగా ముస్లింలు(Muslims) ఈ నెల 31 రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. పండుగ నేపథ్యంలో ముస్లింలకు రంజాన్ తోఫా ఇవ్వాలని బీజేపీ(Bjp) నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 32 లక్షల పేద ముస్లింలకు రంజాన్ తోఫా ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది. బుధవారం ఢిల్లీ(Delhi)లో కిట్ల పంపిణీని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) ప్రారంభించనున్నారు. సౌగాత్ ఈ మోదీ క్యాంపెయిన్ పేరుతో రంజాన్ తోఫా కిట్లను బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నారు. ఈ కిట్లలో పురుషులు, స్త్రీలకు దుస్తులు, సేమియా, ఖర్జూర, ఎండు ఫలాలు, చక్కెర తదితరు వస్తువులు ఉండనున్నాయి.
Bjp | ముస్లింలకు బీజేపీ రంజాన్ తోఫా
Advertisement
Advertisement