TNGOs NIZAMABAD | టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం

TNGOs NIZAMABAD | టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం
TNGOs NIZAMABAD | టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం

అక్షరటుడే, ఇందూరు : TNGOs NIZAMABAD | తలసేమియా బాధితుల(Thalassemia sufferers) కోసం టీఎన్జీవోస్(TNGOS)​ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం(Blood donation camp) నిర్వహించడం అభినందనీయమని అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​ పేర్కొన్నారు. టీఎన్జీవోస్​ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని గృహకల్ప కార్యాలయంలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం చేస్తే టీఎన్జీవోస్​ ప్రతినిధులు సేవాకార్యక్రమాల్లోనూ ముందుండడం అభినందనీయమన్నారు.

Advertisement

TNGOs NIZAMABAD | త్వరలో నిజామాబాద్​లో రక్తదానం శిబిరం

ఉద్యోగులు ఆర్నెళ్లకొకసారి రక్తదానం((Blood donation) చేస్తే తలసేమియా బాధితులకు ఎంతో సేవ చేసినవారవుతారని టీఎన్జీవోస్​ నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్​ పేర్కొన్నారు. తలసేమియా బాధితుల కోసం రాష్ట్ర టీఎన్జీవోస్ ​శాఖ భారీ ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటుచేయడం సంతోషకరమన్నారు. త్వరలో నిజామాబాద్​లోనూ మెగా రక్తదానశిబిరం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

కార్యక్రమంలో ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్, టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హుస్సేని (ముజీబ్), ​ జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి, భీమ్​గల్ అధ్యక్షుడు సృజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement