Bodhan | సమస్యలకు నిలయంగా బోధన్​ ఆస్పత్రి

Bodhan | సమస్యలకు నిలయంగా బోధన్​ ఆస్పత్రి
Bodhan | సమస్యలకు నిలయంగా బోధన్​ ఆస్పత్రి
Advertisement

అక్షరటుడే, బోధన్​ : Bodhan | బోధన్​ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సమస్యలకు నిలయంగా మారింది. ఆస్పత్రికి వెళ్తే తమకు సరైన వైద్యం అందే పరిస్థితి ఏమాత్రం లేదని రోగులు వాపోతున్నారు. చిన్న చిన్న చికిత్సలు సైతం ఆస్పత్రి వైద్యులు చేయడం లేదని.. కేవలం రిఫర్​ చేయడానికి మాత్రమే ఆస్పత్రి పనిచేస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు.

Bodhan | చికిత్స మరిచి.. రిఫర్​ చేస్తూ..

సోమవారం ఉదయం బోధన్​ పట్టణానికి చెందిన స్రవంతి పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చింది. ఈ సందర్భంగా గర్భిణి కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. ఆస్పత్రికి రాగానే గర్భిణిని పరీక్షించిన వైద్యులు బీపీ నార్మల్​గా ఉందని చెప్పారన్నారు. అనంతరం ఆమెను ప్రసూతి వార్డ్​కు తీసుకెళ్లిన అనంతరం మరోసారి బీపీ చూడగా కొద్దిగా ఎక్కువ వచ్చిందని.. దీంతో అక్కడ విధుల్లో ఉన్న గైనకాలజిస్ట్​లు నిజామాబాద్​కు రిఫర్​ చేశారని బాధితులు వాపోయారు. ఆస్పత్రిలో ఉండే జనరల్​ సర్జన్​ సలహా తీసుకోకుండానే వారు వెంటనే జీజీహెచ్​కు రిఫర్​ చేయడంపై వారు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Bodhan police | చోరీ కేసు అనుమానితుడితో పోలీస్​స్టేషన్​ ఊడ్పించిన పోలీసులు

Bodhan | చిన్నచిన్న సమస్యలకు సైతం..

అలాగే చిన్నచిన్న సమస్యలకు సైతం నిజామాబాద్​ జీజీహెచ్​కు రిఫర్​ చేస్తున్నారని రోగులు వాపోతున్నారు. ప్రతినెలా ఖచ్చితంగా 30 గైనిక్​ కేసులను నిజామాబాద్​కు రిఫర్​ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై సూపరింటెండెంట్​తో సంప్రదించగా.. గైనకాలజిస్ట్​లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

Advertisement