Minerva Grand | తిరుపతి మినర్వా గ్రాండ్‌ హోటల్‌లో ప్రమాదం

తిరుపతి మినర్వా గ్రాండ్‌ హోటల్‌లో ప్రమాదం
తిరుపతి మినర్వా గ్రాండ్‌ హోటల్‌లో ప్రమాదం
Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్: Minerva Grand : ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలోని మినర్వా గ్రాండ్‌ హోటల్‌లో ప్రమాదం సంభవించింది. గది నంబరు 314లో పీవోపీతో చేసిన సీలింగ్‌ కుప్పకూలింది. దీంతో ఆ హోటల్‌లో ఉన్న భక్తులు భయాందోళన చెందారు.

సీలింగ్​ కూలడంతో ప్రజలంతా ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అందులో బస చేసిన శ్రీవారి భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ తర్వాత హోటల్ ను సీజ్ చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Tirumala | శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం