అక్షరటుడే, హైదరాబాద్: TGS RTC | బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సభ విషయంలో జనసమీకరణ కోసం తమకు 3వేల బస్సులు అద్దెకు కావాలని ఆర్టీసీని కోరింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను బీఆర్ఎస్ నేతలు కలిశారు. అద్దె బస్సుల కోసం అవసరమైన రూ.8 కోట్ల చెక్కును సజ్జనార్కు అందజేశారు.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు శ్రీనివాస్, తుంగబాలు, కురువ విజయ్ కుమార్ కలిశారు. రూ.8 కోట్ల చెక్కును అందజేసి.. కావాల్సిన బస్సుల వివరాలు తెలియజేశారు.
కాగా, బీఆర్ఎస్ అధికారంలో ఉండగా తమ మీటింగ్లకు ఆర్టీసీ బస్సులను అద్దెకు అడిగితే ఇవ్వలేదని, గతంలో కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మరి బీఆర్ఎస్ సభ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.