Cabinet Expansion | ఢిల్లీలోనే సీఎం, పీసీసీ చీఫ్​

Cabinet Expansion | ఢిల్లీలోనే సీఎం, పీసీసీ చీఫ్​
Cabinet Expansion | ఢిల్లీలోనే సీఎం, పీసీసీ చీఫ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్: Cabinet Expansion మంత్రివర్గ విస్తరణ(Cabinet Expansion)తో పాటు పలు ఇతర విషయాలపై చర్చిండానికి సోమవారం సీఎం రేవంత్​రెడ్డి(Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్​గౌడ్​ ఢిల్లీ(Delhi) వెళ్లిన విషయం తెలిసిందే. ఇందిరా భవన్‌లో ఏఐసీసీ(AICC) అగ్రనేతలతో వీరు సోమవారం రాత్రి భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు సమాచారం.

Advertisement
Advertisement

Cabinet Expansion | మంత్రి పదవుల లెక్క తేలిందా..

ఏఐసీసీ పెద్దలతో సమావేశం తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) హైదరాబాద్​(Hyderabad) చేరుకున్నారు. అయితే సీఎం రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్​గౌడ్(Mahesh Goud)​ ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం వారు తిరిగి రానున్నట్లు సమాచారం. అయితే మంత్రివర్గ విస్తరణపై ఈ భేటీలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Telangana cabinet | మంత్రివర్గ విస్తరణపై కీలక అప్‌డేట్‌..​

బడ్జెట్​ సమావేశాల తర్వాత కేబినెట్​ విస్తరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఓ బీసీ నేతతో పాటు ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యే(MLA)లకు పదవులు దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఒకటి ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాకు కేటాయించనున్నట్లు తెలిసింది.

Advertisement