అక్షరటుడే, వెబ్డెస్క్ : Campa Cola | ఒకప్పుడు భారత మార్కెట్ను శాసించిన కాంపా కోలా(Campa Cola) తర్వాత కనుమరుగు అయిపోయింది. 1980, 90 దశకాల్లో కాంపా కోలా శీతల పానీయంకు మంచి డిమాండ్ ఉండేది. తర్వాత పెప్సీ కో(Pepsi co), కోకో కోలా (cococ cola) కంపెనీలు మార్కెట్లో ఆధిపత్యం చెలాయించడంతో కాంపా కోలా అమ్మకాలు పడిపోయాయి. తర్వాత కంపెనీ మరుగున పడింది. అయితే ఈ భారతీయ కూల్డ్రింక్ను తిరిగి రిలయన్స్ మార్కెట్లోకి తీసుకొచ్చి రికార్డు స్థాయిలో అమ్మకాలు చేపట్టింది.
Campa Cola | రూ.22 కోట్లకు కొనుగోలు
కాంపా కోలా కంపెనీని రూ. 22 కోట్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ.. రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) కొనుగోలు చేసింది. 18 నెలల వ్యవధిలోనే రూ.వెయ్యి కోట్ల ఆదాయం సంపాదించింది. రూ.10కే కాంపా కోలా బాటిళ్లను రిలయన్స్ ప్రవేశపెట్టింది. దీంతో మార్కెట్లో మంచి స్పందన వస్తోంది. తక్కువ ధరకు కూల్ డ్రింక్ లభిస్తుండటంతో కాంపా కోలా కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం భారత శీతల పానీయాల మార్కెట్లో కోకో కోలా 60శాతం, పెప్సీకో 33 శాతం వాటా కలిగి ఉన్నాయి. కాంపా కోలా 2శాతం మాత్రమే ఉంది. అయితే భవిష్యత్లో తన వాటాను పెంచుకోవడానికి ఈ సంస్థ కసరత్తు చేస్తోంది. తనకున్న రిటైల్ వ్యవస్థతో ఈ కూల్ డ్రింక్ను మార్కెట్లోకి తీసుకెళ్లి విజయవంతం అయిన రిలయన్స్ మెల్లిమెల్లిగా వాటా పెంచుకోవాలని చూస్తోంది.