అక్షరటుడే, వెబ్డెస్క్: YouTuber | యూట్యూబర్ హర్షసాయికి సైబరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. యూట్యూబ్లో తన వీడియోల ద్వారా ఫేమస్ అయిన హర్షసాయి ఇటీవల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. అయితే దానికి హర్షసాయి స్పందిస్తూ తాను ప్రమోట్ చేయకపోతే మరొకరు చేస్తారని తన చర్యలను సమర్థించుకున్నాడు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న భయ్యా సన్నీయాదవ్పై కూడా సూర్యాపేట జిల్లా పోలీసులు తాజాగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
YouTuber | గతంలోనూ కేసు
హర్షసాయిపై గతంలోనూ కేసు నమోదైంది. ప్రేమ, పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని ఆయనపై ఓ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన నుంచి రూ.రెండు కోట్లు తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో ఆయనపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. అయితే కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్న హర్షసాయి తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి మళ్లీ వార్తల్లో నిలిచాడు.