Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : దేశంలో మరో కొత్త వైరస్​ కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో గులియన్​ బారే సిండ్రోమ్​ (జీబీఎస్​) కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఈ వైరస్​తో పుణేకు చెందిన ఓ వ్యక్తి మరణించాడు. ఇప్పటి వరకు అక్కడ 101 మందికి ఈ వైరస్​ సోకినట్లు మహారాష్ట్ర వైద్య శాఖ తెలిపింది. ఇందులో 16 మంది వెంటీలెటర్​పై చికిత్స పొందుతున్నారు.

రోగ నిరోధక శక్తిపై దాడి

అరుదుగా సోకే జీబీఎస్​​ వైరస్​ చాలా ప్రమాదకరం. ఇది నేరుగా రోగ నిరోధక శక్తిపై దాడి చేసి మనిషిని బలహీనం చేస్తుంది. దీంతో నరాల బలహీనత, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. ఈ వైరస్​ సోకిన వారు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతారు. ఈ వ్యాధికి చికిత్స లేదు. కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. కేసులు నమోదు అవుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Advertisement