అక్షరటుడే, వెబ్ డెస్క్: పశువుల మేతకు వెళ్లిన ముగ్గురు కాపర్లు వరద నీటిలో చిక్కుకున్న ఘటన సాలూరు మండలం మందర్నలో జరిగింది. గ్రామానికి చెందిన శివరాజ్, చందు, ప్రకాష్ గురువారం మంజీరా నది ఒడ్డున పశువులను మేపుతుండగా ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దీంతో ముగ్గురు వరద నీటిలో చిక్కుకుపోగా గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ నరేష్, ఎస్సై నాగనాథ్ వెంటనే అక్కడికి చేరుకొని గజ ఈతగాళ్లతో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
Advertisement