అక్షరటుడే, ఇందూరు: Nizamabad CP | హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్(Police commissioner Nizamabad) సాయి చైతన్య (ips sai Chaitanya) సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోలీ(holi festival) రోజు ఇష్టం లేని వాళ్లపై రంగు చల్లొద్దని సూచించారు. సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే సెక్షన్ 22 ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Nizamabad CP | డ్రంకన్ డ్రైవ్ తనిఖీలకు ప్రత్యేక బృందాలు
డ్రంకన్ డ్రైవ్ తనిఖీలకు ప్రత్యేక బృందాలను నియమించనున్నట్లు కమిషనర్ సాయిచైతన్య తెలిపారు. ద్విచక్ర వాహనాల్లో గుంపులుగా వెళ్లడం, స్టంట్లు చేయవద్దన్నారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Nizamabad CP | బెట్టింగ్ ఆడితే సమాచారం ఇవ్వండి
జిల్లాలో ఎవరైనా బెట్టింగ్ ఆడితే సమాచారం ఇవ్వాలని సీపీ సూచించారు. బెట్టింగ్ పెట్టే వారితో పాటు యాప్లను రన్ చేసేవారిని కట్టడి చేస్తామని చెప్పారు.