HCU Lands | సోషల్​ మీడియాలో పోస్టులు తొలగిస్తున్న ప్రముఖులు.. ఎందుకో తెలుసా!

HCU Lands | సోషల్​ మీడియాలో పోస్టులు తొలగిస్తున్న ప్రముఖులు.. ఎందుకో తెలుసా!
HCU Lands | సోషల్​ మీడియాలో పోస్టులు తొలగిస్తున్న ప్రముఖులు.. ఎందుకో తెలుసా!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HCU Lands | పలువురు రాజకీయ నాయకులు(politicians), సినీ ప్రముఖులు (film celebrities) తాము పెట్టిన ట్వీట్లను(tweets) తొలగిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్​లోని కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూముల వ్యవహారంలో ఏఐ(AI)తో సృష్టించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్​ మీడియా(Social Media)లో వైరల్​ అయ్యాయి. ప్రభుత్వం వేలం వేయాలనుకున్న ఆ భూముల్లో జింకలు(Deers), నెమళ్లు(Peacocks), అటవీ జంతువులు(Forest animals) ఉన్నట్లు కొందరు ఫేక్​ ఫొటోలు, వీడియోలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేశారు.

Advertisement
Advertisement

HCU Lands | షేర్​ చేసిన పలువురు

ఫేక్​, నకిలీ వీడియోలను పలువురు ప్రముఖులు సైతం పోస్టులు చేయడంతో కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూముల వ్యవహారం వివాదానికి దారి తీసింది. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి, ధ్రువ్​రాఠి, సినీ ప్రముఖులు జాన్​ అబ్రహం, దియా మిర్జా, రవీనా ఠండన్​ లాంటి వారు ఈ నకిలీ ఫొటోలు (Fake photos), వీడియోలను(videos) తమ వ్యక్తిగత ఖాతాల్లో పోస్టు చేశారు. కాగా నకిలీ ఫొటోలు వ్యాప్తి చేసిన వారిపై ప్రభుత్వం సీరియస్(Government Serious)​ అయింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Bhu Bharati | రైతుల పాలిట శాపం ‘ధరణి’

HCU Lands | హైకోర్టులో పిటిషన్​

ఏఐ(AI)తో నెమళ్లు, జింకలు ఉన్న ఫొటోలు(Photos) సృష్టించి ఆందోళనలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు(High Court)ను ఆశ్రయించింది. ఈ మేరకు సోమవారం పిటిషన్(Pitition)​ వేయగా.. ఈ నెల 24న ధర్మాసనం దానిని విచారించనుంది.

కాగా.. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి(Union Minister Kishan Reddy), మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి(Former Minister Jagadish Reddy) తమ పోస్టులను డిలీట్​ చేశారు. మిగతా వారు సైతం వాటిని తొలగించనున్నట్లు సమాచారం. కాగా ఈ ఫేక్​ ఫొటోలు సృష్టించారని బీఆర్​ఎస్​ నేత మన్నె క్రిశాంక్​(BRS leader Manne Krishank)కు ఇదివరకే గచ్చిబౌలి పోలీసులు నోటీసులు(Notice) ఇచ్చారు. ఏఐ(AI)తో ఫొటోలు తయారు చేసి వివాదాన్ని పెద్దది చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

Advertisement