అక్షర టుడే నిజాంసాగర్:BRS Nizamsagar | బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్లో తలపెట్టనున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే(Former MLA Hanmant Shinde) కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం(BRS Party Office)లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
జుక్కల్ నియోజకవర్గం నుంచి 3వేల మంది కార్యకర్తలు సభకు హాజరుకానున్నారని వివరించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆధ్వర్యంలో దుర్మార్గపు పాలన సాగుతోందని దుయ్మబట్టారు. సమావేశంలో మాజీ ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి దుర్గారెడ్డి, సీనియర్ నాయకులు గైని విఠల్, మనోహర్, రమేష్ గౌడ్, హైమద్, బేగరి రాజు, వెంకటేశం, శ్రీకాంత్ రెడ్డి, అంజయ్య తదితరులు ఉన్నారు.