అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నగరంలో మూడు రోజుల క్రితం అపహరణకు గురైన చిన్నారి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. వన్ టౌన్(One Town) పరిధిలో రోడ్డు పక్కన ఓ కుటుంబం పిల్లలతో నిద్రిస్తుండగా రమ్య అనే మూడేళ్ల చిన్నారిని దుండగుడు ఎత్తుకెళ్లాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలించారు. ఈ క్రమంలో నస్రుల్లాబాద్(Nasrullabad) మండలం మిర్జాపూర్ గ్రామానికి చెందిన గైక్వాడ్ బాలాజీ చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. నిందితుడి ఇంట్లో చిన్నారిని కనుగోని బుధవారం రాత్రి నగరానికి తీసుకొచ్చారు. బాలాజీ పరారీలో ఉండగా అతడి సోదరుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Nizamabad | కిడ్నాపైన చిన్నారి ఆచూకీ లభ్యం
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement