అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Case | లంచం తీసుకున్న ఓ సీఐ(CI), కానిస్టేబుల్పై ఏసీబీ(ACB) అధికారులు కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Badrachalam) ఎస్హెచ్వో SHO రమేశ్ తో పాటు కానిస్టేబుల్ రామారావు ఏసీబీకి చిక్కారు.
తనిఖీల్లో భాగంగా కంకర రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. అయితే ఎలాంటి కేసు నమోదు చేయకుండా వాహనాన్ని వదిలి పెట్టడానికి రూ.30 వేల లంచం డిమాండ్ చేశారు. వాహన యజమాని బతిమిలాడటంతో రూ.20 వేలకు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో ఫోన్ పే ద్వారా రూ.20 వేలు పంపిన తర్వాత వాహనాన్ని వదిలేశారు. అయితే బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో లంచం తీసుకున్న ఎస్హెచ్వో రమేశ్, కానిస్టేబుల్ సీహెచ్ రామారావు, ప్రైవేట్ వ్యక్తి కార్తీక్పై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.