అక్షరటుడే, వెబ్​డెస్క్​: రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్‌ కార్డులు అందిస్తామని సివిల్​ సప్లయ్స్​ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తెలిపారు. కార్డుల పంపిణీ పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు సన్నబియ్యం అందిస్తామని పేర్కొన్నారు. కరీంనగర్​ జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం మాదిరిగా తినలేకుండా ఉండే దొడ్డు బియ్యం కాకుండా.. మంచి క్వాలిటీ ఉండే సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు.