అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | యూ ట్యూబ్(Youtube) ఛానెళ్ల పేరిట తమను, తమ కుటుంబ సభ్యులను తిట్టి వారికి సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) వార్నింగ్ ఇచ్చారు. వారు తీరు మార్చుకోకపోతే తోడ్కలు తీస్తానని హెచ్చరించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శనివారం ఆయన మాట్లాడారు. కొందరు జర్నలిస్టుల(Journalists) పేరిట ఇష్టం వచ్చినట్లు వీడియోలు తీసి యూట్యూబ్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇంట్లో ఆడవాళ్లని తిట్టిస్తూ వీడియోలు పెడితే తమకు కోపం రాదా అని ప్రశ్నించారు.
CM Revanth Reddy | ప్రజా జీవితంలో ఉన్నందుకే..
ప్రజా జీవితంలో ఉన్నందుకే ఓపిక పడుతున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. తమ తల్లిని, భార్యను తిడుతూ వీడియోలు పెడుతున్నారని మండిపడ్డారు. అలాంటి వారిని వదిలి పెట్టమని స్పష్టం చేశారు. తోడ్కలు తీస్తామని, బట్టలుడదీసి రోడ్డు మీద తిప్పిస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా ఇటీవల రేవంత్రెడ్డిని తిట్టిన వీడియో పోస్టు చేసిన జర్నలిస్ట్ రేవతి(Revathi)ని పోలీసులు అరెస్ట్(Arrest) చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు అరెస్టును ఖండించారు. దీంతో సీఎం స్పందించారు. అరెస్టును ఖండించే వారు.. వారి కుటుంబ సభ్యులను తిడితే ఊరుకుంటారా అని సీఎం ప్రశ్నించారు.
CM Revanth Reddy | ముసుగు తీసి కొడతాం..
జర్నలిస్ట్ సంఘాల(Journalist Unions) నాయకులు జర్నలిస్టుల లిస్ట్ ఇవ్వాలని రేవంత్రెడ్డి సూచించారు. ఆ లిస్ట్లో ఉన్న వారు తప్పు చేస్తే ఎలా శిక్షించాలో కూడా నిర్ణయించాలని ఆయన అన్నారు. అలాగే ఆ లిస్ట్లో లేకుండా జర్నలిస్టులమని చెప్పుకునే వారిని తాము క్రిమినల్స్ కింద పరిగణిస్తామని సీఎం స్పష్టం చేశారు. వారికి ఎలా జవాబు చెప్పాలో తమకు తెలుసన్నారు. ముసుగు వేసుకొని వస్తే ముసుగు తీసి కొడతామన్నారు. తనకు పౌరుషం ఉందని, అలాంటి వారిపై చట్టపరంగానే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.