అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: యాదాద్రిని యాదగిరిగుట్టగా పేరు మార్చాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా యాదగిరి గుట్ట లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకున్నారు. యాదగిరిగుట్ట ఆలయ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్‌బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గోశాలలో గోసంరక్షణకు ప్రత్యేకపాలసీ తీసుకొస్తామన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  SLBC | ఎస్​ఎల్​బీసీ సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలు